Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపోయిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:19 IST)
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో విరిగిపోయిన సీటులో కూర్చొని గంటన్నర పాటు ప్రయాణం చేశారు. దీనిపై మంత్రి చౌహాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియా నిర్వహణను టాటా గ్రూపు తీసుకున్న తర్వాత ఎయిర్‌లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నానని, కానీ అది తన అపోహేనని అర్థమైందని మంత్రి వ్యాఖ్యానించారు.
 
ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, ఈ సమస్యను యాజమాన్యం ఆలస్యంగా గుర్తించిందని, ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగ్గా లేవని సిబ్బంది చెప్పారని కేంద్రమంత్రి చౌహాన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారన్నారు. కానీ, వారికి ఇబ్బంది కలగించడం ఇష్టం లేక అదే విరిగిపోయిన సీటులోనే గంటన్నరపాటు కూర్చొని ప్రయాణించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...

ఓ.టి.టి.కోసం డాకు మహారాజ్ చిత్రమైన ప్రమోషన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments