ఒక్క రూపాయికే పెట్రోల్ ... ఎక్కడ.. ఎందుకు?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (09:24 IST)
ఒకవైపు దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ లేదా డీజల్ ధర రూ.వంద దాటిపోయింది. అయితే, ముంబై మహానగరంలో మాత్రం ఒక్క రూపాయికే పెట్రోల్ లభ్యమవుతుంది. ఒక్క రూపాయికి పెట్రోల్ రావడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఉది. ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఉంటే మహారాష్ట్ర పర్యావరణ మంత్రిగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఉన్నారు. అయితే, ఠాక్రే పుట్టిన రోజును వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. 
 
డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. 
 
అలాగే, అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పెట్రోలు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments