Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రూపాయికే పెట్రోల్ ... ఎక్కడ.. ఎందుకు?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (09:24 IST)
ఒకవైపు దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ లేదా డీజల్ ధర రూ.వంద దాటిపోయింది. అయితే, ముంబై మహానగరంలో మాత్రం ఒక్క రూపాయికే పెట్రోల్ లభ్యమవుతుంది. ఒక్క రూపాయికి పెట్రోల్ రావడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఉది. ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఉంటే మహారాష్ట్ర పర్యావరణ మంత్రిగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఉన్నారు. అయితే, ఠాక్రే పుట్టిన రోజును వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. 
 
డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. 
 
అలాగే, అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పెట్రోలు పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments