Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో కొట్టింది నిజమే.. అయితే ఏంటి? మర్డర్ కేసు పెట్టుకోండి : ఎయిరిండియా ఉద్యోగులతో ఎంపీ (Video)

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:45 IST)
ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎంపీ రవీంద్ర గ్వైకాడ్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన 80 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బహిర్గతమైంది. ఇది మరింత దిగ్భాంతి కలిగిస్తోంది. ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ చెప్పుతో కొడుతున్నప్పుడు పక్కనే ఉన్న సిబ్బంది ఎంతగా వేడుకున్నా ఆయన వెనక్కి తగ్గక పోవడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
దీంతో ఆయనపై మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేయగా... ‘‘ఏంటి నామీద కేసు పెడతారా... ఇప్పటికే చాలా కేసులున్నాయ్... కావాలంటే మర్డర్ కేసు పెట్టుకోండి’’ అంటూ ఆయన మాట్లాడడంతో అక్కడున్నవారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
అనంతరం ఆమె కలుగజేసుకుని... ‘‘మీరు మా ప్రతినిధి సర్... మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు.. మీకు మేము ఓటేసి ఎన్నుకున్నాం... మీరు మాత్రం ఎందుకిలా చేస్తున్నారు..’’ అంటూ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గైక్వాడ్ వెనక్కి తగ్గలేదు సరికదా మిగతా వారిపైనా చిందులేయడం మొదలుపెట్టారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments