Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య క

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (17:15 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను ముంబై పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధించారు. 
 
ఈ నేపథ్యంలో ఇంద్రాణి ముఖర్జియా తండ్రి ఇటీవల మరణించారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె వేసిన మధ్యంత బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గౌహతికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని... కావాలంటే పోలీసుల భద్రత మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని సూచన చేసింది. 
 
అంతేకాదు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. 2012లో షీనాబోరాను హత్యచేసి, రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియా కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments