Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిష్కరణకు గురైన వ్యక్తి ఇపుడు హోంమంత్రిగా ఉండటం విచిత్రం : శరద్ పవార్

సెల్వి
శనివారం, 27 జులై 2024 (16:54 IST)
రాష్ట్ర బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ఇపుడు దేశ హోం మంత్రిగా ఉండటం విచిత్రమని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అవినీతిపరులకు ముఠా నాయుకుడిగా శరద్ పవార్‌ను పోల్చుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. దేశంలోని అవినీతిపరులకు నేనొక ముఠా నాయుకుడిని అంటూ అమిత్ షా నాపై విమర్శలు చేశారు. కానీ, గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ళు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి ఇపుడు దేశానికే హోంమంత్రిగా ఉండటం విచిత్రం అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
 
చట్టాలను దుర్వినియోగం చేశారన్న కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు రెండేళఅలు బహిష్కరించింది నిజం కాదా, మన దేశం ఎలాంటి వ్యక్తుల చేతిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంటువంటి వ్యక్తులు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారు అంటూ శరద్ పవార్ ధ్వజమెత్తారు. గతంలో సంచలనం సృష్టించిన సొహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించిన విషయం తెల్సిందే. ఈ అంశాన్నే శరద్ పవరా తాజాగా ఎత్తి చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments