Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా శిర్గావ్ ఆలయంలో నిప్పులపై నడుస్తూ తోసుకున్న భక్తులు, ఏడుగురు మృతి

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (08:50 IST)
గోవాలోని శ్రిగావ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీ లైరాయి దేవి జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తొక్కిసలాటకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలాగే, మృతులను కూడా గుర్తించాల్సివుంది. 
 
శ్రీ లైరాయి దేవి జాతరను ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు గోవా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తుంటారు. లైరాయి దేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ పండుగలో సంప్రదాయ ధోండాచిలో భాగంగా, వేలాది మంది భక్తులు పాదరక్షకులు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. ఈ వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్లు, భక్తిగీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments