Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్‌కు మమతా బెనర్జీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:36 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందింది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర కమిటీ వేసిందని, అలాంటపుడు మరో కమిటీ ఎందుకంటూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు ఆదేశించిందనీ, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరో కమిటీ ఎందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ పెగాసస్ స్నూపింగ్ కేసు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో పాటు.. విపక్ష సభ్యులంతా ఏకమై పార్లమెంట్‌ను స్తంభింపజేశారు. ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి పేపర్లు చింపి ఛైర్మన్ మీదకు విసిరేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments