రాజ్ఠాక్రేకు ఎస్పీ సవాల్ : మీకు దమ్ముంటే పాకిస్థాన్కు ఆత్మాహుతి బాంబర్లను పంపండి
మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. బాలీవుడ్లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామన్న మహారాష్ట్ర నవనిర్మ
మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) స్పందించింది. బాలీవుడ్లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తామే మెడపట్టి గెంటేస్తామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) వ్యాఖ్యలపై ఎస్పీ నేత అబు అజ్మీ స్పందించారు.
పాకిస్థాన్ నుంచి భారత్కు అధికారికంగా వచ్చే వారిని భయపెట్టడం కాదని, దమ్ముంటే లాహోర్, కరాచీలకు ఆత్మాహుతి దళాలను పంపించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేకు ఆయన సవాల్ విసిరారు.
'పాకిస్థాన్ భారత్పైకి ఆత్మాహుతి దాడులకు దిగుతోంది. మీకు దమ్ముంటే, దేశంపై ప్రేమ ఉంటే లాహోర్, కరాచీలకు సూసైడ్ బాంబర్లను పంపించండి. అంతేకానీ ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు' అని రాజ్థాక్రేకు అబు అజ్మీ సూచించారు. 'మీరో చిన్న నేత. మీ పరిధి మహారాష్ట్ర వరకే పరిమితమని వ్యాఖ్యానించారు.