Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియంత్రణ రేఖను దాటి రెచ్చిపోతున్న భారత సేనలు.. 20 మంది ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అదీ కూడా.. భారత భూభాగంలో కాదు. నియంత్రణ రేఖ దాటి వెళ్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (10:36 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని భారత ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత సేనలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అదీ కూడా.. భారత భూభాగంలో కాదు. నియంత్రణ రేఖ దాటి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. 
 
ఈ నెల 20, 21వ తేదీల్లో హెలికాప్టర్ ద్వారా భారత బలగాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టి కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు సమాచారం. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. పీవోకేలోని మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 18 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. 
 
ఈ నెల 20న పీవోకేలోని గిల్గిత్, స్కర్దు నగరాలతోపాటు ఖైబర్-ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చిత్రల్ నగరానికి పాకిస్థాన్ ప్రభుత్వం విమానాలను రద్దు చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments