Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగుతో సెల్ఫీలా..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:30 IST)
ఏపీ-ఒడిశా సరిహద్దులో ఏనుగుల గుంపు ఒకటి సందడి చేసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్లింది. స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది.
 
ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి సరదాగా ఆడుకున్నారు, సెల్ఫీలు దిగారు. బిడ్డ ఇంకా రావట్లేదని అమ్మ ఏనుగు కంగారుగా వెనక్కు వచ్చింది.

అక్కడ పిల్లలు గున్న ఏనుగు చుట్టూ గుమికూడి దాన్ని పట్టించడం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది తల్లి ఏనుగు. దాన్ని అలా చూసేసరికి బిక్కచచ్చిపోయిన యువకులు పరుగులు తీశారు.
 
అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఓ యువకుడు ఏనుగు రాకను గమనించక అక్కడే ఉండిపోయాడు. తల్లి ఏనుగు అతడిపై దాడి చేసింది. కిందపడేసి తొక్కినంత పని చేసింది. సమయానికి దగ్గరలో ఉన్న యువకులు, స్థానికులు పరుగున వచ్చి ఏనుగును తరిమేశారు.

ఏనుగు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments