COVID 19 కాలంలో అక్రమ సిగరెట్లను నిర్భందించటం 800% పెరిగింది

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (23:10 IST)
స్మగ్లింగ్ మరియు నకిలీ చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తూ స్మగ్లింగ్ కార్యకలాపాలను ఎదుర్కోవటానికి అప్రమత్తంగా ఉన్న భారతదేశ సంస్థలకు ప్రశంస లభించింది. భారతీయ ఏజెన్సీలు సుమారు రూ .50 వేల విలువైన అక్రమ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నాయి. భారతదేశం అంతటా గత ఐదు నెలల్లో 412 కోట్లు విలువచేసే స్మగ్లింగ్ సరుకును పట్టేశాయి. 2019లో ఈ అక్రమ వ్యాపారం రూ. 52 కోట్లుగా వుంటే అది 2020 ఇదే కాలానికి ఏకంగా 800% అంటే సుమారు 412 కోట్లకు పెరిగింది. ఇది కూడా COVID -19 మహమ్మారి సమయంలో అడ్డుకున్నవి.
 
గత ఐదు నెలల్లో, ముంబై, కోల్‌కతా, నార్త్ ఈస్ట్, భోపాల్, హైదరాబాద్ మరియు అనేక ఇతర నగరాల్లో అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్, డిఆర్‌ఐ, అస్సాం రైఫిల్స్, బిఎస్‌ఎఫ్ మరియు రాష్ట్ర పోలీసులు నివేదించారు. FICCI, CASCADE చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, "సంవత్సరంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. అనేక పరిమితులు ఉన్నప్పటికీ భారతదేశం పొగాకు స్మగ్లర్లకు లక్ష్యంగా కొనసాగుతోందని సూచిస్తుంది. నేర సంస్థలు దేశంలోకి అక్రమ రవాణా వస్తువుల చొరబాట్లను నిర్ధారించే మార్గాలను అన్వేషిస్తున్నాయని స్పష్టమవుతోంది.”
 
నేరస్థులను నిర్విరామంగా వెంబడించినందుకు ప్రభుత్వాన్ని మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను అభినందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ల ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments