Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఓ మహిళకు రెండోసారి కరోనావైరస్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:34 IST)
కరోనా బారిన పడిన వారికి రెండోసారి మహమ్మారి సోకుతుందా? ఈ ప్రశ్నకు విభిన్న సమాధానాలొస్తున్నాయి. కొందరు రెండోసారి కూడా వస్తుందంటే.. మరికొందరు ఆ అవకాశం చాలా తక్కువ అంటున్నారు. కానీ, ఈ మహమ్మారి రెండోసారి కూడా సోకిన ఉదంతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినట్లు హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించడం, నెదర్లాండ్స్, బెల్జియంలోనూ ఇలాంటి రెండు కేసులు వెలుగుచూసినట్లు వార్తలు రావడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
 
తాజాగా బెంగళూరులోనూ 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు గత జూలైలో కరోనా పాజిటివ్‌ రాగా చికిత్స చేయడంతో నయమైంది. నెల రోజుల తర్వాత ఆమెకు రెండోసారి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో 27 ఏళ్ల మహిళ జులై మొదటి వారంలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన తర్వాత పాజిటివ్‌ అని తేలింది. చికిత్స చేసిన అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్‌ రిపోర్టు వచ్చింది.
 
జులై 24న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నెల రోజుల తర్వాత ఆగస్టు చివరిలో మళ్లీ అదే లక్షణాలతో ఆస్పత్రికి వస్తే.. పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అని బెంగళూరులోని ఫోర్టిస్‌ ఆస్పత్రి వైద్యుడు ప్రతీక్‌ పాటిల్‌ మీడియాకు తెలిపారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని చెప్పారు. తాజా కేసులో రెండోసారి మహిళకు యాంటీబాడిస్‌ పరీక్షలో నెగటివ్‌ తేలిందని వైద్యులు వెల్లడించారు. 
 
దీనిని బట్టి వైరస్‌ సంక్రమించిన తర్వాత ఆమెకు వ్యాధి నిరోధక శక్తి పెరగకపోవడమైనా ఉండాలి. లేదంటే అభివృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నశించిపోయి ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా సోకిన వారందరికీ ఇది రెండోసారి సంక్రమిస్తుందని చెప్పలేమన్నారు.
 
 కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన కొందరికి వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైన కొన్ని వారాల తర్వాత తిరిగి 'పాజిటివ్‌'గా తేలుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.
 
అయితే, అది వారి శరీరాల్లో ఇంకా మిగిలి ఉన్న వైరస్‌ అవశేషాలు లేక ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టిందా లేక అది కొత్తగా సోకిన ఇన్‌ఫెక్షనా అన్నదానిపై శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. ఒకసారి ఈ వ్యాధి సోకినప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి వైరస్‌ను నాశనం చేస్తాయి. అలాంటివారికి రెండోసారి వ్యాధి బారినపడకుండా రోగనిరోధక శక్తి ద్వారా రక్షణ ఉంటుందా..? ఉంటే అది ఎంతకాలం కొనసాగుతుంది? తదితర అంశాలను నిర్ధాలించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments