Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (09:25 IST)
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు అస్త్రశస్త్రాలతో విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరిగాయి. ఆ తర్వాత రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ వాడివేడిగా సాగనుంది.
 
ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం, అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని తూర్పారబట్టాలని విపక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో పాటు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో ఆందోళన చేయనుంది.
 
మరోవైపు, రెండో విడత బడ్జెట్ సమావేశాలపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ స్పందిస్తూ, ఈ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లులను ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశంమని, ఆ తర్వాతే విపక్ష పార్టీల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments