Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా ఆంక్షలు ఎత్తివేత - 1 నుంచి స్కూల్స్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:33 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వైద్య నిపుణులతో సమీక్ష చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను శుక్రవారం రాత్రి నుంచి ఎత్తివేశారు. 
 
అలాగే, ఆదివారాల్లో అమలు చేస్తూ వచ్చిన సంపూర్ణ లాక్డౌన్‌ను ఈ నెల 30వ తేదీన అమలు చేయబోమని స్పష్టం చేశారు. అన్నికంటే ముఖ్యంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
అలాగే, వారాంతాల్లో కూడా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదుల్లో భక్తులకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచన చేశారు. అయితే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments