Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో విద్యా సంస్థలు బంద్ ... సీఎం శివరాజ్ సింగ్ వెల్లడి

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (16:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2.64 లక్షల మేరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు కూడా ఐదు వేలకు పైగా దాటిపోయాయి. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఈ నెల 31వ తేదీ వరకు ఒకటో తేదీ నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రాజకీయ, మతపరమైన, ఇతర వేడుకలను కూడా నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. 
 
కాగా, గురువారం ఒక్క రోజే ఈ రాష్ట్రంలో 4031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కోవిడ్ పాజిటివిటీ రేటు 4.5 శాతం 5.1 శాతానికి పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments