Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో విద్యా సంస్థలు బంద్ ... సీఎం శివరాజ్ సింగ్ వెల్లడి

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (16:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2.64 లక్షల మేరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు కూడా ఐదు వేలకు పైగా దాటిపోయాయి. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఈ నెల 31వ తేదీ వరకు ఒకటో తేదీ నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రాజకీయ, మతపరమైన, ఇతర వేడుకలను కూడా నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. 
 
కాగా, గురువారం ఒక్క రోజే ఈ రాష్ట్రంలో 4031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కోవిడ్ పాజిటివిటీ రేటు 4.5 శాతం 5.1 శాతానికి పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments