Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజా ఓ వైపు.. భారీ వర్షాలు మరోవైపు.. తమిళనాడు ప్రజల నానా తంటాలు

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:58 IST)
తమిళనాడు దక్షిణాది జిల్లాలను గజా తుఫాను అతలాకుతలం చేసింది. తాజాగా మరో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు ఏడు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. మరో 45 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలతో పాటు మద్రాస్ యూనివర్శిటీ పరీక్ష తేదీలను మార్పు చేసింది. 
 
తమిళనాడు, పుదుచ్చేరిల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. కాంచీపురం, తిరువళ్లూరు, విలుప్పురం జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఇక గజా తుఫాను కారణంగా 46 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
గజా తుఫాను ధాటికి నాగపట్నం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వాధికారులు అప్రమత్తంగా వుండాలని వర్ష బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో వుండాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments