Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్.బి.ఐకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (15:29 IST)
ఎన్నికల బాండ్ల అంశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. క్రమ సంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ వివరాలన్నింటితో గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. బ్యాంకు నుంచి వివాలన్నీ అందినవెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. 
 
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్.బి.ఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌‍పై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు ఆధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోరుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్.బి.ఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments