Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకే శశికళ ఇళ్లపై దాడులు.. 1050 ఎకరాల భూమి స్వాధీనం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి కేసులో నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ తర్వాత చెన్నైకి చేరుకున్న మూడు రోజులకే ఆమె సంబంధీకులపై దాడులు మొదలయ్యాయి.
 
కాంచీపురం, తంజావూర్‌, తిరువారూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ఆస్తులను అధికారులు జప్తు చేశారు. కాంచీపురంలో రూ.300 కోట్ల విలువైన 144 ఎకరాలకు పైగా భూమి, తంజావూర్‌లో 26 వేల చదరపు అడుగుల భూమి, తిరువారూర్‌లో సుమారు 1050 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములన్నీ శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని, ఇవన్నీ 1994-96 మధ్య కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు.
 
అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకే తాము దాడులు చేశామని అధికారిక ప్రకటనల్లో ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగడానికి మూడు నెలల ముంగిట జైలు నుంచి శశికళ విడుదలైన నేపథ్యంలో ఈ దాడులు జరుగడం కొన్ని సందేహాలు, అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో రాజకీయ కక్ష సాధింపేమీ లేదని, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర సీఎం ఈకే పళనిస్వామి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments