ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (11:24 IST)
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల నుంచి మరోమారు బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులకు చెందిన వాట్సాప్ గ్రూపుకు మెసేజ్ పంపించారు. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే ఈ డబ్బు ఇవ్వాల్సిందేనంటూ అగంతకులు తమ డిమాండ్‌లో పేర్కొన్నారు. 
 
"ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దు. సల్లూ భాయ్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో వైరానికి శాశ్వత ముగింపు పలకాలన్నా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలి. ఈ నగదు ఇవ్వకుంటే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ కంటే దారుణమై నపరిస్థితులు చూడాల్సి వస్తుంది" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ మెసేజ్ ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై వారు విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవల సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ముంబైలో కాల్చి చంపిన విషయం తెల్సిందే. కృష్ణ జింక వేటాడి చంపిన కేసు నుంచి ఈ ముఠా సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనేవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments