Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర సంక్రాంతి ముగిసింది.. శబరిమల ఆలయం మూసివేత

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:21 IST)
కేరళ శబరిమలలో మకర సంక్రాంతికి అనంతరం వారం వ్యవధిలో ఆలయాన్ని మూసివేస్తారు. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. 
 
దీంతో శాస్త్రోక్తంగా అయ్యప్ప దేవాలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. 
 
ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్‌లో డేట్లు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
 
కాగా ఆలయం మూసివేత సందర్భంగా రాజకుటుంబీకులు మూలం తిరున్నాల్ శంకర్ వర్మ.. గురువారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వంశాచారం ప్రకారం రాజు అయ్యప్ప స్వామిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. 
 
సేవల అనంతరం స్వామి వారి "తిరువాభరణం" పందళంలోని ఆలయానికి తరలిస్తారు. నాలుగు రోజుల పాటు ప్రయాణించి తిరువాభరణం ఆదివారానికి పందళం చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments