Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర సంక్రాంతి ముగిసింది.. శబరిమల ఆలయం మూసివేత

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:21 IST)
కేరళ శబరిమలలో మకర సంక్రాంతికి అనంతరం వారం వ్యవధిలో ఆలయాన్ని మూసివేస్తారు. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. 
 
దీంతో శాస్త్రోక్తంగా అయ్యప్ప దేవాలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. 
 
ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్‌లో డేట్లు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
 
కాగా ఆలయం మూసివేత సందర్భంగా రాజకుటుంబీకులు మూలం తిరున్నాల్ శంకర్ వర్మ.. గురువారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వంశాచారం ప్రకారం రాజు అయ్యప్ప స్వామిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. 
 
సేవల అనంతరం స్వామి వారి "తిరువాభరణం" పందళంలోని ఆలయానికి తరలిస్తారు. నాలుగు రోజుల పాటు ప్రయాణించి తిరువాభరణం ఆదివారానికి పందళం చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments