శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై దాడి.. (Video)

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:39 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులపై ఆలయ భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లలో ఉన్న అయ్యప్ప భక్తుకు, ఆలయ భద్రతా సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్విదానికి దారితీయడంతో భక్తులపై ఆలయ సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువలతో కొట్టడంతో ఏపీకి చెందిన భక్తుల్లో పలువురికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఏపీ భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆలయ భద్రతా సిబ్బంది (పోలీసులు)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఐదుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments