Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై దాడి.. (Video)

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:39 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులపై ఆలయ భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లలో ఉన్న అయ్యప్ప భక్తుకు, ఆలయ భద్రతా సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్విదానికి దారితీయడంతో భక్తులపై ఆలయ సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువలతో కొట్టడంతో ఏపీకి చెందిన భక్తుల్లో పలువురికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఏపీ భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆలయ భద్రతా సిబ్బంది (పోలీసులు)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఐదుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments