Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ పదవీకాంక్ష కోసం పనిచేసి... ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:31 IST)
ఐప్యాక్ అధినేత, ఎన్నికల జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పదవీకాంక్ష కోసం పని చేసిచేశానని తెలిపారు. నిజానికి ఈ పని చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకు పాటుపడి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. 
 
రాజకీయాల్లో మార్పు కోసం జన్ సురాజ్ పేరుతో ఆయన మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపరాన్ జిల్లాలోని భితిఙర్వా నుంచి 3500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మాగాంధీ 1917లో ఇక్కడి నుంచి మొదటి సత్యాగ్రమ ఉద్యమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ యాత్ర ఆదివారం లౌరియాకు చేరుకుంది. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల కోసం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కృషి చేసివుంటే బాగుండేదని అన్నారు. అసలైన మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోయడంద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనే విషయాన్ని సత్యం తనకు ఆలస్యంగా అర్థమైందన్నారు. 
 
అంతేకాకుండా, బీజేపీని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం కష్టమని విపక్ష కూటమికి సూచించారు. ఓ కప్పులో ఉండే పైపే నురగే బీజేపీ అయితే, దానికింద ఉండే అసలైన కాఫీయే ఆర్ఎస్ఎస్ అని అన్నారు. సామాజిక వ్యవస్థలో అది భాగమైపోయిందని, షార్ట్‌కట్స్‌తో దానిని ఓడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments