Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని హత్య చేస్తావా? నీతో పడక పంచుకుంటా..?

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:21 IST)
ప్రేమ, ఆప్యాయతలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను దారుణంగా హత్య చేయించింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో డీల్ కుదుర్చుకుంది. హత్య జరిగిన తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్ డబ్బులు చెల్లించడంతో పాటుగా అతడితో పడక పంచుకుంటానని చెప్పింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చందు మహాపూర్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లైంది. అయితే అతడు 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చందును కోరింది. అందుకు చందు నిరాకరించాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుని.. అతడిని చంపేందుకు భరత్ గుర్జర్ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో డీల్ కుదుర్చుకుంది. హత్య చేసిన తర్వాత అతడికి రూ. 1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. అలాగే అతడితో కలిసి పడక పంచుకుంటానని హామీ ఇచ్చింది.
 
ఈ క్రమంలోనే భరత్.. చందును ఫిబ్రవరి 25న హత్య చేశాడు. చందు హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడు భరత్‌ను గుర్తించారు. భరత్ యువతి నుంచి డబ్బులు, సెక్స్ పొందకముందే స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ హత్యకు ప్రణాళిక రచించిన యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం