Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. 12మంది బాలికలకు పాజిటివ్

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (21:47 IST)
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ)లో కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో స్కూల్ లో ఉన్న అందరికీ కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్ లు చేయించారు అధికారులు. 
 
కరోనా పాజిటివ్ వచ్చిన 12 మంది విద్యార్థులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు అధికారులు. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 132 మంది స్టూడెంట్స్, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగటివ్ రాగా, 12 మంది బాలికలకు మాత్రం పాజిటివ్ వచ్చింది. 
 
ర్యాపిడ్ టెస్ట్‌లలో నెగటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టీపీసిఆర్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేశారు అధికారులు. అయితే.. ఈ రిపోర్టులు రేపు రానున్నాయి. ఆ రిపోర్టుల్లో ఇంకా ఎవరికైనా పాజిటివ్‌ వస్తుందోననే భయంలో ఇటు సిబ్బంది అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments