Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:57 IST)
దొంగతనం చేయడానికి కూడా ఒకరోజును ఎంచుకుంది ఓ దొంగలముఠా. కేవలం అమావాస్య రోజున మాత్రమే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజున దొంగతనాలు చేస్తుండడంతో వారిని అమావాస్య గ్యాంగ్ అని పిలుస్తారు. 
 
అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు తుమకూరు టౌన్‌ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్‌కుయార్‌లుగా గుర్తించారు. వీరు కేవలం అమావాస్య రోజే బైక్‌ చోరీలకు పాల్పడుతుండడం విశేషం.
 
నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల సహాయంతో కస్టమర్‌లకు విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహా ఎఫ్‌జడ్‌ బైక్‌ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. 
 
ఇద్దరినీ విచారించగా.. నిజం బయటకు వచ్చింది. తమ వద్ద 13 ఖరీదైన బైక్‌లు ఉన్నాయని వారు తెలిపారు, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్యాంగ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments