Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:57 IST)
దొంగతనం చేయడానికి కూడా ఒకరోజును ఎంచుకుంది ఓ దొంగలముఠా. కేవలం అమావాస్య రోజున మాత్రమే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజున దొంగతనాలు చేస్తుండడంతో వారిని అమావాస్య గ్యాంగ్ అని పిలుస్తారు. 
 
అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు తుమకూరు టౌన్‌ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్‌కుయార్‌లుగా గుర్తించారు. వీరు కేవలం అమావాస్య రోజే బైక్‌ చోరీలకు పాల్పడుతుండడం విశేషం.
 
నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల సహాయంతో కస్టమర్‌లకు విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహా ఎఫ్‌జడ్‌ బైక్‌ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. 
 
ఇద్దరినీ విచారించగా.. నిజం బయటకు వచ్చింది. తమ వద్ద 13 ఖరీదైన బైక్‌లు ఉన్నాయని వారు తెలిపారు, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్యాంగ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments