Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రోడ్డు ప్రమాదాలు - ఐదేళ్లలో 7.77 లక్షల మంది దుర్మరణం

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (20:28 IST)
భారతదేశంలో 2018 నుండి 2022 వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 7 లక్షల 77 వేల 423గా ఉందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖ ఇచ్చిన సమాచారాన్ని వెల్లడించారు. ఈ గణాంకాల మేరకు దేశ వ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యను ఆయన బహిర్గతం చేశారు. గత 2018లో 1,57,593 మంది, 2019లో 1,58,984 మంది మరణించారు. 2020లో 1,38,383 మంది, 2021లో 1,53,972 మంది, 2022లో 1,68,491 మంది మరణించారు. ఈ ఐదేళ్లలో మొత్తం 7 లక్షల 77 వేల 423 మంది మరణించినట్టు తెలిపారు. 
 
అలాగే, 2022లో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా మరణించిన వారి వివరాలను వెల్లడిస్తూ, అతి వేగం కారణంగా జరిగిన ప్రమాదాల్లో 1,19,904 మంది మరణించినట్టు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేసి 4,201 మంది, రాంగ్‌ లేన్‌లలో డ్రైవింగ్‌ చేసి 9,094 మంది, రెడ్‌లైట్‌ లిమిట్‌ దాటడం వల్ల 1,462 మంది, మొబైల్‌లో మాట్లాడుతూ ప్రమాదాల్లో 3,395 మంది మరణించారు. ఫోన్లు, ఇతర కారణాల వల్ల 30,435 మంది మరణించారని తెలిపారు. 
 
జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మిగిలిన 20,000 కి.మీ హైవేలను నిర్మించాలని ప్రణాళిక వేసింది. ఈ పనులు వివిధ స్థాయిలలో ఉంటాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రోడ్డు నిర్మాణాన్ని పెంచాలని యోచిస్తున్నారు. కొనసాగుతున్న ప్రాజెక్ట్ పనిలో అడ్డంకులను పరిష్కరించడానికి ప్రక్రియలు కూడా మెరుగుపరచబడతాయి. దేశంలో హైవేల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు హైస్పీడ్ మోడల్ సిస్టమ్‌ను అనుసరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
అలాగే, జాతీయ రహదారులపై మొత్తం 5293 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో రూ.178 కోట్లతో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 4,729 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. తమిళనాడులో 369 ఛార్జింగ్ స్టేషన్లు, పాండిచ్చేరిలో రెండు ఛార్జింగ్ స్టేషన్లు, కేరళలో 138 ఛార్జింగ్ స్టేషన్లు, కర్ణాటకలో 300 ఛార్జింగ్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 249, తెలంగాణలో 221 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద మొత్తం 5833 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను హైవేలపై ఏర్పాటు చేశారు. వీటిలో తమిళనాడులో 649, పుదుచ్చేరిలో 16, కేరళలో 189, ఆంధ్రప్రదేశ్‌లో 319, తెలంగాణలో 244 ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments