Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు పోతున్నా.. మొబైల్ ఫోన్ దోచుకుని పారిపోయాడు

సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్ద

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (11:13 IST)
సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్దామనో లేక, అంబులెన్స్‌కు ఫోన్ చేద్దామన్న కనీస ఆలోచన చేయకపోగా ఏకంగా గాయపడ్డ వ్యక్తిని దోచుకున్నాడో ప్రబుద్ధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ సుభాష్‌నగర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన మతిబూల్ అనే రిక్షా కార్మికుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్రగాయాలకు గురై రక్తమోడుతూ రోడ్డుపై అలాగే పడిపోయాడు. అయితే... ఆ సమయంలో అతన్ని రక్షించేందుకు ఎవరూ రాలేదు. అనంతరం అటువైపుగా వెళ్తున్న మరో రిక్షా కార్మికుడు గాయపడ్డ వ్యక్తిని చూసి కనీసం తన తోటి రిక్షా కార్మికుడని కూడా చూడకుండా అతని మోబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు.
 
కాగా... తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, పోలీసులకు 7 గంటలకు విషయం తెలిసి వారు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే రక్తం అధిక మోతాదులో పోవడంతో అతను మృతిచెందాడు. తాదా. ఆ టెంపో డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే కిందకు దిగి చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజి ద్వారా తెలిసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments