Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (15:23 IST)
చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీనిపై విశాల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేశారు. డిసెంబర్ 5, 2016న అమ్మ(జయలలిత) చనిపోయిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, ‘ప్రజాస్వామ్యానికి నా నివాళి’ అంటూ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. "ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని ఒప్పుకున్నారు.. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు విశాల్. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments