Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (15:23 IST)
చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీనిపై విశాల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేశారు. డిసెంబర్ 5, 2016న అమ్మ(జయలలిత) చనిపోయిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, ‘ప్రజాస్వామ్యానికి నా నివాళి’ అంటూ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. "ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని ఒప్పుకున్నారు.. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు విశాల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments