Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎట్టకేలకు ఆర్‌కే నగర్ బరిలో "పందెం కోడి"

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది.

ఎట్టకేలకు ఆర్‌కే నగర్ బరిలో
, మంగళవారం, 5 డిశెంబరు 2017 (21:13 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్.కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. 
 
ఈ ఎన్నికల్లో హీరో విశాల్ పోటీ చేస్తున్నారు. పలు నాటకీయ పరిణామాల మధ్య ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల సంఘం తొలుత తిరస్కరించగా, ఆ తర్వాత ఆమోదించింది. 
 
అదేసమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అఫిడవిట్‌లో లోపాల కారణంగా దీపా జయకుమార్‌ నామినేషన్‌ తిరస్కరించామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
దీంతో ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో విశాల్‌తో పాటు అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌, డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్‌, భాజపా అభ్యర్థిగా నాగరాజన్‌, ఏఐడీఏడీఎంకే బహిష్కృత నేత టిటివి దినకరన్‌ ప్రస్తుతం బరిలో ఉన్నారు. దీంతో పంచముఖ పోటీ నెలకొంది. 
 
ఇదిలావుండగా, తన నామినేషన్‌ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ సినీనటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని, దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ఆయన నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి పేరుతో వాడుకున్నాడు.. మోసపోయా.. చనిపోతున్నా...