Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (14:40 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు పోకిరీ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. తమకు చదువు చెప్పే ఉపాధ్యాయురాలి కుర్చీ కింద బాంబు పెట్టి, రిమోట్‌తో పేల్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ టీచర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని ఓ పాఠశాలలో 12వ తరగతి విద్యాభ్యాసం చేసే కొందరు విద్యార్థులను సైన్స్ పాఠాలు బోధించే మహిళా టీచర్ తిట్టారు. అల్లరి పనులుమాని చదువుపై దృష్టిసారించాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులకు ఏమాత్రం రుచించలేదు. తరగతి గదిలో తమను అవమానించిన టీచర్‌పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బాణాసంచాతో బాంబు తయారు చేసి, దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చారు. 
 
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూలు మొత్తం ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి కుర్చీ దెబ్బతింది. అయితే, అదృష్టవశాత్త టీచర్‌ మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై మండిపడిన ప్రిన్సిపాల్.. ఈ పనికి పాల్పడిన విద్యార్థులందరినీ సస్పెండ్ చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments