లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (14:40 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు పోకిరీ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. తమకు చదువు చెప్పే ఉపాధ్యాయురాలి కుర్చీ కింద బాంబు పెట్టి, రిమోట్‌తో పేల్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ టీచర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని ఓ పాఠశాలలో 12వ తరగతి విద్యాభ్యాసం చేసే కొందరు విద్యార్థులను సైన్స్ పాఠాలు బోధించే మహిళా టీచర్ తిట్టారు. అల్లరి పనులుమాని చదువుపై దృష్టిసారించాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులకు ఏమాత్రం రుచించలేదు. తరగతి గదిలో తమను అవమానించిన టీచర్‌పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బాణాసంచాతో బాంబు తయారు చేసి, దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చారు. 
 
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూలు మొత్తం ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి కుర్చీ దెబ్బతింది. అయితే, అదృష్టవశాత్త టీచర్‌ మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై మండిపడిన ప్రిన్సిపాల్.. ఈ పనికి పాల్పడిన విద్యార్థులందరినీ సస్పెండ్ చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments