Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నాబ్ గోస్వామిపై దుండగుల దాడి.. ఢిల్లీలో కలకలం

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:42 IST)
ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ టీవీ చానెల్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై గురువారం వేకువజామున దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దాడిలో గోస్వామి దంపతులకు ఎలాంటి గాయాలుకాలేదు. 
 
కానీ, వారు ప్రయాణిస్తున్న కారు మాత్రం దెబ్బతింది. ఈ దాడిపై అర్నాబ్‌ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందంటూ అర్నాబ్ గోస్వామి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి 24 గంటలకు తిరగక ముందే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
కాగా, మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి ఘటన నేపథ్యంలో టీవీ లైవ్‌ చర్చలో అర్నాబ్‌ తన రాజీనామాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments