Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- అదిరిన సైనిక పరేడ్..

దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. ఢిల్లీ రాజ్ పథ్‌లో నిర్వ

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (10:58 IST)
దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. ఢిల్లీ రాజ్ పథ్‌లో నిర్వహించిన సైనిక పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. 
 
వంద అడుగుల భారీ వేదికపై ఆసీనులైన పదిదేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాజ్ పథ్‌కు రావడంతో గణతంత్ర వేడుకలు అధికారికంగా మొదలయ్యాయి.
 
ఈ వేడుకల్లో భారత సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనికుల విన్యాసాలతో సాగిన పరేడ్‌ను ప్రజలతో పాటు పది దేశాల అధినేతలు కన్నార్పకుండా తిలకించారు. అతిథుల భద్రత నిమిత్తం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments