Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఊరట

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల అమలులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్​ను ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ వివరణ ఇచ్చింది. హైకోర్టులో కేసు ఉండటంతోనే కాస్త ఆలస్యమైందని అఫిడవిట్​లో తెలంగాణ సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును కొట్టేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 19నే కొట్టేసింది. ఇరు రాష్ట్రాల సీఎస్​ల అఫిడవిట్లతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పాఠశాలల్లో మౌలిక వసతులపై ఉన్నత ధర్మాసనం ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.

నియామకాల్లో సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదని పిటిషన్ వేసిన జేకే రాజు, వెంకటేష్​లకు అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments