Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఊరట

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల అమలులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్​ను ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ వివరణ ఇచ్చింది. హైకోర్టులో కేసు ఉండటంతోనే కాస్త ఆలస్యమైందని అఫిడవిట్​లో తెలంగాణ సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును కొట్టేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 19నే కొట్టేసింది. ఇరు రాష్ట్రాల సీఎస్​ల అఫిడవిట్లతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పాఠశాలల్లో మౌలిక వసతులపై ఉన్నత ధర్మాసనం ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.

నియామకాల్లో సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదని పిటిషన్ వేసిన జేకే రాజు, వెంకటేష్​లకు అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments