ప్రేమను నిరాకరించిందనీ నిప్పుపెట్టిన సైకో లవర్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (08:57 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో శనివారం తెల్లవారుజాను ఓ భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదం విద్యుదాఘాతం వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. 
 
ఆ భవనంలో నివసించే ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనందుకుగాను ఓ యువకుడి భవనానికి నిప్పుపెట్టినట్టు తేలింది. ఈ కిరాతక చర్యకు పాల్పడిన సైకోను శుభం దీక్షిత్ (27)గా గుర్తించారు. శనివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న ఈ యువకుడు అక్కడ పార్క్ చేసిన స్కూటర్‌కు నిప్పుపెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో చెలరేగి అక్కడ పార్క్ చేసిన ఇతర వాహనాలకు అంటుకున్నాయి. అక్కడ నుంచి భవనానికి వ్యాపించాయి. 
 
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అందులోని కొందరు కిందకు దూకి ప్రాణాలు కోల్పోగా ఐదుగురు మాత్రం మంటల్లో కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరంపై స్థానిక పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments