Webdunia - Bharat's app for daily news and videos

Install App

2026 తరువాతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (08:03 IST)
రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తరువాత జరిగే తొలి జనగణన ప్రచురణ తరువాత ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపి ఎ.రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు.

'ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 15లో ఏ నిబంధన ఉన్నప్పటికినీ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170కి లోబడి, ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం ఏపిలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెంచాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3) ప్రకారం ప్రతి రాష్ట్రంలోని మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య సర్దుబాటు 2026 అనంతరం తొలి జనగణన ప్రచురితమయ్యాకే ఉంటుంది' అని మంత్రి సమాధానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments