Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలి : బీజేపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రాంప్రసాద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా నిలబెట్టిన కాల్చిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయన తేజ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతిని

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (11:24 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రాంప్రసాద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా నిలబెట్టిన కాల్చిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయన తేజ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అత్యాచారంలాంటి హేయమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా కాల్చేయాలి లేదా ఉరేయాలి. ఇలాంటి దారుణ ఘటనలకు ముగింపు పలకడానికి ఇదే ఏకైక మార్గం. మహిళలకు గౌరవం ఇవ్వని వారి పట్ల ఇలాగే వ్యవహరించాలి అంటూ పిలుపునిచ్చారు. 
 
అంతేకాక మహిళలపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా, వారిని ఉద్దేశపూర్వకంగా తాకినా అలాంటి మృగాలకు కనీసం పదేళ్ల జైలుశిక్షను విధించాలన్నారు. రేపిస్టులను అంతమొందించడానికి షూటింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
ఇటీవల అసోంలోని నాగావో జిల్లాలో గతవారం ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హతమార్చిన నేపథ్యంలో శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపిస్టుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments