Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో అత్యాచారాల పర్వం... బాలికను ఖాళీ ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి రేప్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:18 IST)
దేశరాజధాని హస్తినాపురిలో అత్యాచారాలపర్వం కొనసాగుతోంది. ఓ బాలికతో పాటు.. మరో ఇద్దరు యువతులపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌లో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఈమె పార్కులో ఆడుకుంటుండగా, తెలిసి వ్యక్తితో పాటు.. మరో ముగ్గురు వ్యక్తులు వచ్చిన పక్కనే ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా సమీప ఫ్లాట్‌కు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడని కళ్యాణ్‌పురి పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
 
అలాగే, పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన కార్యాలయ పనులు ముగించుకుని వచ్చిన యువతిని లిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన నిందితులు మార్గమధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 
 
నేరానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం