Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో అత్యాచారాల పర్వం... బాలికను ఖాళీ ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి రేప్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:18 IST)
దేశరాజధాని హస్తినాపురిలో అత్యాచారాలపర్వం కొనసాగుతోంది. ఓ బాలికతో పాటు.. మరో ఇద్దరు యువతులపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌లో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఈమె పార్కులో ఆడుకుంటుండగా, తెలిసి వ్యక్తితో పాటు.. మరో ముగ్గురు వ్యక్తులు వచ్చిన పక్కనే ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా సమీప ఫ్లాట్‌కు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడని కళ్యాణ్‌పురి పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
 
అలాగే, పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన కార్యాలయ పనులు ముగించుకుని వచ్చిన యువతిని లిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన నిందితులు మార్గమధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 
 
నేరానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం