Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్తే... పురిటినొప్పులని తేలింది.. చివరికి?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:26 IST)
ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్లిన తల్లికి షాక్ తప్పలేదు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని, ఆమె కడుపులో గ్యాస్ ఏర్పడిందని చెప్పింది. దీంతో వైద్యులు ఆ బాలికను జనరల్ వార్డుకు తరలించి టెస్ట్ చేశారు. అయితే పరీక్ష అనంతరం ఆ బాలిక పురిటి నొప్పులతో బాధపడుతోందని తేల్చారు. ఆ మాట విని ఆ బాలిక తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. మరో అరగంటలో ఆ బాలిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆపై దాదాపు పది నెలల క్రితం పొరుగింట్లో ఉండే ఓ 24 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. స్కూల్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ యువకుడు బలవంతంగా తనను పొలం వైపు ఈడ్చుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పింది. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించాడని, అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పలేదని తెలిపింది. బాలిక వాంగ్మూలం తర్వాత నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు అతడిని అరెస్ట్ చేశారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌ సిహోరా సివిల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments