Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్తే... పురిటినొప్పులని తేలింది.. చివరికి?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:26 IST)
ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్లిన తల్లికి షాక్ తప్పలేదు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని, ఆమె కడుపులో గ్యాస్ ఏర్పడిందని చెప్పింది. దీంతో వైద్యులు ఆ బాలికను జనరల్ వార్డుకు తరలించి టెస్ట్ చేశారు. అయితే పరీక్ష అనంతరం ఆ బాలిక పురిటి నొప్పులతో బాధపడుతోందని తేల్చారు. ఆ మాట విని ఆ బాలిక తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. మరో అరగంటలో ఆ బాలిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆపై దాదాపు పది నెలల క్రితం పొరుగింట్లో ఉండే ఓ 24 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. స్కూల్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ యువకుడు బలవంతంగా తనను పొలం వైపు ఈడ్చుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పింది. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించాడని, అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పలేదని తెలిపింది. బాలిక వాంగ్మూలం తర్వాత నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు అతడిని అరెస్ట్ చేశారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌ సిహోరా సివిల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments