Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

తెలంగాణాలో విహహితపై సామూహిక అత్యాచారం

Advertiesment
victim
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. కొందరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దారుణం రాష్ట్రంలోని జహీరాబాద్‌లోని డిడిగి గ్రామ పరిధిలో జరిగింది. 
 
24 యేళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? లేక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ఓ వివాహితను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమెను జహీరాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 
 
శనివారం ఉదయం స్పృహకోల్పోయి అపస్మారక స్థితిలో పడివున్న మహిళను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వివాహితకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది. 
 
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సంగారెడ్డి సఖీ కేంద్రానికి తరిలంచారు. అయితే, ఈ గ్యాంగ్ రేప్‌ వ్యవహారంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా గోప్యంగా ఉంచడంపై ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పామును పట్టేందుకు వెళ్లి ప్రాణం విడిచిన అర్చకుడు.. ఎక్కడ?