Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే అత్యాచార నిందితుడు.. తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి చంపేశాడు..

Webdunia
గురువారం, 16 జులై 2020 (17:19 IST)
తనను జైలుకు పంపారనే అక్కసుతో అత్యాచార నిందితుడు తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాకు చెందిన యశ్‌వీర్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య 2016, జులై వరకు స్నేహం బాగానే సాగింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. అదే ఏడాది 13 ఏళ్ల వయసున్న బాలికపై అత్యాచారం చేశాడు. 
 
పోలీసులు యశ్ వీర్‌ను అత్యాచారం కేసు కింద.. 2016, అక్టోబరులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత యశ్ వీర్ జైలు పాలయ్యాడు. బెయిల్‌పై 2017 చివరలో విడుదల అయ్యాడు. అప్పట్నుంచి తనను జైలు పాలు చేసిన అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. అదను చూసి దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14)వ తేదీ.. సైకిల్‌పై వెళ్తున్న తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో ఢీకొట్టేలా చేశాడు యశ్‌వీర్.
 
ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యశ్ వీర్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments