రెండు రేప్‌ కేసులు.. గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష.. ఏకకాలంలో అమలు కష్టం

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:08 IST)
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది. రెండు వేర్వేరు కేసుల్లో మరో పదేళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి ప్రకటించారు. 
 
గుర్మీత్ సింగ్‌పై 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం, హత్య చేసినట్లు కేసు నమోదైంది. అయితే రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేసే అవకాశం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుర్మీత్‌కు సుదీర్ఘకాలం శిక్ష విధించాలని సీబీఐ న్యాయమూర్తిని కోరింది. కానీ గుర్మీత్ చేసిన సమాజసేవని పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని గుర్మీత్ తరఫు న్యాయవాది జడ్జిని కోరారు.
 
ఇదిలా ఉంటే.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఒక్కో అత్యాచారం కేసులో పదేళ్ల శిక్షను మాత్రమే ఎందుకు విధించారు? యావజ్జీవ కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించలేదు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా గుర్మీత్ 2002లో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2005లో అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై పోక్సో చట్టం వర్తించలేదు. దీంతో కేవలం పదేళ్ల జైలు శిక్ష, 15 లక్షల చొప్పున జరిమానాకు పరిమితమయ్యాడు. మొత్తంగా 20 ఏళ్ల జైలు శిక్ష, 30 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

బిగ్ బాస్‌కు వెళ్ళడంతో కెరీర్ కోల్పోయాను : కరాటే కళ్యాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments