Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు - కృష్ణుడు ధూమపానం చేశారా? రాందేవ్ బాబా ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (12:40 IST)
యువతలో పెరిగిపోతున్న ధూమపానం అలవాటుపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు వంటి వారు ధూమపానం చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ కుంభమేళాకు వచ్చిన సాధువులను ఆయన కలిశారు. ఆ సమయంలో సాధువులు ధూమపానం చేస్తుండటాన్ని రాందేవ్ గుర్తించారు. అపుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, సాధువులెవ‌రూ ధూమ‌పానం చేయరాదంటూ కోరారు. 
 
రాముడు, కృష్ణుడి బాట‌ను మ‌నం అనుస‌రిస్తున్నామ‌ని, వాళ్లెవ్వ‌రూ ధూమ‌పానం చేయ‌లేద‌ని, మ‌నం కూడా ధూమ‌పానం చేయ‌కూడద‌ని వాగ్ధానం చేయాల‌ని అన్నారు. ఓ మంచి కార‌ణం కోసం మ‌నం మ‌న ఇంటిని, త‌ల్లితండ్రుల‌ను వ‌దిలి వచ్చామ‌ని, అలాంట‌ప్పుడు స్మోకింగ్‌ను ఎందుకు వ‌దిలేయ‌లేమ‌న్నారు. 
 
ఈ సందర్భంగా పలువురు సాధువుల వద్ద ఉన్న ధూమపాన పైపులను తీసుకున్న బాబా రాందేవ్.. వాటిని తాను నిర్మించబోయే ఆలయంలో ఉంచనున్నట్టు వారికి తెలిపారు. ఎంతో యువతను ధూమపానం నుంచి విముక్తులను చేశానని, అలాగే, సాధువులతో కూడా పొగతాగకుండా చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments