Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దీదీ ఓ దీదీ' అంటున్న వర్మ.. వీడియో చూసి నవ్వలేక...

Webdunia
సోమవారం, 3 మే 2021 (09:44 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. ఆయనలో క్రియేటివిటీ స్కిల్స్ పుష్కలం అని మరోమారు ఈ వీడియో ద్వారా నిరూపించారు. 
 
తాజాగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధితార టీఎంసీ విజయభేరీ మోగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 
 
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. అదీ కూడా వీడియో రూపంలో. ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 'దీదీ ఓ దీదీ' అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. 
 
"ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్‌ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్‌ను ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోతుందా యువతి".
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటే... బీజేపీ ఫాలోవర్స్ మాత్రం రాంగోపాల్ వర్మపై విరుచుకుపడుతున్నారు. మరికొందరు వర్మ క్రియేటివిటీని పొగడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments