Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 3 తరువాత ఏం చేద్దాం?.. కేంద్ర మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాలోచనలు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:09 IST)
కోవిడ్‌-19పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు పలువురు సీనియర్‌ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య సమన్వయంపై మంత్రులు సమావేశంలో చర్చించారు.

అదేవిధంగా మే 3వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై భేటీలో నేతలు చర్చించారు.

సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, టెక్స్‌టైల్‌ మంత్రి స్మృతి ఇరానీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రామ్‌ విలాస్‌ పాశ్వన్‌, గిరిరాజ్‌ సింగ్‌, సంతోష్‌ గాంగ్వర్‌, రమేశ్‌ పోక్రియాల్‌, పియూష్‌ గోయల్‌ సమావేశానికి హాజరయ్యారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి మంత్రుల బృందం సమావేశం కావడం ఇది ఐదోసారి. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులను రవాణాకు, ప్రజలకు అందుతున్న సేవలపై సమావేశ అజెండాలుగా మంత్రులు భేటీలో చర్చించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments