Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ హత్య కేసు : ముద్దాయి శాంతన్ విడుదల

వరుణ్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (15:32 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన శాంతన్ అనారోగ్యం కారణంగా బుధవారం చెన్నైలో ప్రాణాలు విడిచాడు. కాలేయ సమస్యతో చెన్నైలోని జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శాంతన్.. బుధవారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 55 యేళ్లు. హత్య కేసులోని ముద్దాయిలందరూ ఇటీవల విడుదలైన విషయం తెల్సిందే. వీరిలో శాంతన్ కూడా ఒకరు. ఈయన తన సొంత దేశమైన శ్రీలంకకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరగా, అందుకు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది.
 
కాలేయ సమస్యతో అనారోగ్యం పాలైన ఆయన జీహెచ్ ఆస్పత్రిలో చేరకాగ, ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు చనిపోయినట్టు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత ఆయన మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
గత 1991లో రాజీవ్ హత్య కేసులో ఇతర దోషులతో పాటు శాంతన్ జైలుశిక్షను అనుభవించాడు 2022లో సుప్రీంకోర్టు వీరికి జైలు జీవితం నుంచి స్వేచ్ఛను ప్రసాదించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ముగ్గురు దోషులతో కలిసి తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంపాలై జీహెచ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments