Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే.నగర్ బరిలో ఇళయరాజా తమ్ముడు.. రజినీకాంత్ మద్దతు ఇస్తారా?

చెన్నై, ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈయన సంగీత దిగ్గజం ఇళయరాజా సోదరుడు. పైగా, గంగై అమరన్ బీజేపీ

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (16:32 IST)
చెన్నై, ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈయన సంగీత దిగ్గజం ఇళయరాజా సోదరుడు. పైగా, గంగై అమరన్ బీజేపీ తమిళనాడు శాఖ సాంస్కృతిక విభాగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఆయన నివాసంలోనే గంగై అమరన్ మంగళవారం కలుసుకున్నారు. తన నివాసానికి వచ్చిన గంగై అమరన్‌కు రజినీ సాదరస్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫోటో దిగి మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా రజినీ ఆశీస్సులను గంగై అమరన్ కోరినట్టు తెలుస్తోంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రజినీకాంత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి కూడా. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ స్వయంగా రజినీకాంత్ ఇంటికెళ్లి అల్పాహారం కూడా స్వీకరించారు. దీంతో రజినీకాంత్ బీజేపీకి మద్దతు ఇస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
ఈ పరిస్థితుల్లో ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో గంగై అమరన్‌ను బరిలోకి దించడం వెనుక మోడీ హస్తమున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో సౌమ్యుడిగా ముద్రపడిన గంగై అమరన్‌కు చిత్రపరిశ్రమలో ప్రతి ఒక్కరితో సత్ సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు వివాదరహితుడు. దీంతో రజినీ వంటి వారు గంగై అమరన్‌కు మద్దతిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై రజినీకాంత్ అధికారికంగా స్పందించాల్సి వుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments