Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడిపై ట్రాక్టర్‌తో ఎనిమిదిసార్లు తొక్కించి చంపేశారు.... ఎక్కడ?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (12:23 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ భూవివాదం కేసులో వరుసకు సోదరుడైన వ్యక్తిపై ట్రాక్టరుతో ఎనిమిది సార్లు తొక్కించి చంపేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భరత్‌పూర్‌లోని బయానా ప్రాంతానికి చెందిన బహదూర్ సింగ్ గుర్జర్, అతర్ సింగ్ గుర్జర్ కుటుంబాల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. బుధవారం బహదూర్ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో వచ్చారు. ఈ విషయం తెలిసి అతర్ సింగ్ కుటుంబ సభ్యులూ అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. 
 
ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో అతర్ సింగ్ కుటుంబానికి చెందిన నిర్పత్ నిరసనగా నేలపై పడుకోగా, బహదూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టరుతో దూసుకొచ్చాడు. అక్కడున్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ట్రాక్టరుతో వెనక్కి ముందుకు 8 సార్లు తొక్కించాడు. దాంతో నిర్పత్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు, నిందితుడు వరుసకు సోదరులవుతాడు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments