Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి వేలాడదీసిన కిరాతకుడు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 18 యేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు తొలుత అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపేశారు. పిమ్మట చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. ఈ దారుణం రాష్ట్రంలోని దుంగాపూర్ జిల్లా సంగ్వారాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత సోమవారం ఈ గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతున్న 18 యేళ్ళ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో మృతురాలికి ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కాబోయే భర్తతో మాట్లాడసాగింది. అయితే, ఆ యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన నిందితుడు ముఖేష్ నానోమా... ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడిని కేవలం 20 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
అతనివద్ద జరిపిన విచారణలో ఆ యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడని, ఆమె మరో వ్యక్తికి దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపి మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీసినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments