Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి వేలాడదీసిన కిరాతకుడు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 18 యేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు తొలుత అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపేశారు. పిమ్మట చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. ఈ దారుణం రాష్ట్రంలోని దుంగాపూర్ జిల్లా సంగ్వారాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత సోమవారం ఈ గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతున్న 18 యేళ్ళ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో మృతురాలికి ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కాబోయే భర్తతో మాట్లాడసాగింది. అయితే, ఆ యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన నిందితుడు ముఖేష్ నానోమా... ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడిని కేవలం 20 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
అతనివద్ద జరిపిన విచారణలో ఆ యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడని, ఆమె మరో వ్యక్తికి దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపి మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీసినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments