Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి వేలాడదీసిన కిరాతకుడు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 18 యేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు తొలుత అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపేశారు. పిమ్మట చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. ఈ దారుణం రాష్ట్రంలోని దుంగాపూర్ జిల్లా సంగ్వారాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత సోమవారం ఈ గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతున్న 18 యేళ్ళ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో మృతురాలికి ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కాబోయే భర్తతో మాట్లాడసాగింది. అయితే, ఆ యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన నిందితుడు ముఖేష్ నానోమా... ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడిని కేవలం 20 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
అతనివద్ద జరిపిన విచారణలో ఆ యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడని, ఆమె మరో వ్యక్తికి దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపి మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీసినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ranga Sudha: ట్విట్టర్‌లో అలాంటి ఫోటోలు వైరల్.. పంజాగుట్ట స్టేషన్‌లో కంప్లైంట్

నందమూరి బాలకృష్ణ ఎన్ఎస్ఈలో బెల్ మోగించిన తొలి స్టార్‌గా చరిత్ర సృష్టించారు

భద్రకాళి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది : తృప్తి రవీంద్ర, రియా జిత్తు

కిష్కింధపురి కథకి స్ఫూర్తి రామాయణం : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

Ram: రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి పప్పీ షేమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments