Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతనానికే మచ్చ తెచ్చింది.. కుమార్తెను అమ్మేసింది.. తండ్రి ఎవరో?

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (10:52 IST)
ఆధునిక యుగం, స్మార్ట్ ఫోన్‌ల యుగంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వావివరుసలు లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కన్నతల్లి తన కుమార్తెను వ్యభిచార రొంపిలోకి దించేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె(15), కుమారుడు ఉన్నారు. 
 
మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్య భర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ తండ్రి తన బిడ్దలను పెంచుతానని చెప్పినా భార్య ఒప్పుకోలేదు. తన వద్ద వుంచుకుని కుమార్తెను నానా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో తన కూతురును వ్యభిచార గృహానికి అమ్మేసింది.
 
అక్కడ వారు కొంతకాలం వాడుకుని వేరొక ముఠాకు అమ్మగా ప్రస్తుతం ఆ బాలిక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఇక తల్లి ప్రవర్తన నచ్చిని ఆ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments