Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3లక్షలకు బాలికను అమ్మేశారు.. గర్భం దాల్చలేదని టార్చెర్

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:50 IST)
బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ బాలికను ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆమెను లైంగికంగా వేధించి.. గర్భం దాల్చలేదని హింసించాడు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఆపై పిల్లల హక్కుల సంస్థ కంట పడటంతో ఆ బాలిక పట్ల జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
 
రాజస్థాన్‌లోని మారుమూల ధోల్‌పూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఆమె తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి గత ఏడాది 40 ఏళ్ల వ్యక్తికి రూ.3 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
ఆ బాలిక గర్భం దాల్చనందుకు భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు భరించలేని ఆ బాలిక ఆ ఇంటి నుంచి పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
 
కాగా, ఆ బాలిక ఇటీవల భర్త ఇంటి నుంచి పారిపోయింది. బాలల హక్కుల సంఘం బచ్‌పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) కంట ఆమె పడింది. దీంతో ఆ బాలికను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం