Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3లక్షలకు బాలికను అమ్మేశారు.. గర్భం దాల్చలేదని టార్చెర్

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:50 IST)
బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ బాలికను ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆమెను లైంగికంగా వేధించి.. గర్భం దాల్చలేదని హింసించాడు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. ఆపై పిల్లల హక్కుల సంస్థ కంట పడటంతో ఆ బాలిక పట్ల జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
 
రాజస్థాన్‌లోని మారుమూల ధోల్‌పూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఆమె తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి గత ఏడాది 40 ఏళ్ల వ్యక్తికి రూ.3 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
ఆ బాలిక గర్భం దాల్చనందుకు భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు భరించలేని ఆ బాలిక ఆ ఇంటి నుంచి పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
 
కాగా, ఆ బాలిక ఇటీవల భర్త ఇంటి నుంచి పారిపోయింది. బాలల హక్కుల సంఘం బచ్‌పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) కంట ఆమె పడింది. దీంతో ఆ బాలికను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం